SRIKAKULAM
శ్రీకాకుళం జిల్లా
ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం జిల్లా తీరప్రాంత అందాలతో ప్రసిద్ధి.
వంశధార, నాగావళి నదులు ఈ ప్రాంతానికి నీటి వనరులు.
సముద్ర తీర ప్రాంతాలు ప్రకృతి సోయగాలను అందిస్తాయి.
పచ్చని గ్రామీణ ప్రకృతి ఎక్కువగా కనిపిస్తుంది.
నది, సముద్రం కలిసిన ప్రకృతి శ్రీకాకుళం ప్రత్యేకత.
• అభివృద్ధికి నోచుకోని శ్రీకాకుళం బీచ్లు
• 193 కి.మీ. తీర ప్రాంతం… హామీలకే పరిమితమైన అభివృద్ధి
• బారువ బీచ్ సహా పలు ప్రాంతాల్లో వసతుల కొరత
• 67 బీచ్ల అభివృద్ధికి ప్రతిపాదనలు… అమలు ఎప్పుడో?
• తాగునీరు, మరుగుదొడ్లు, రహదారులు లేక సందర్శకుల ఇబ్బందులు
• కనీస వసతులు కల్పిస్తే పెరుగుతాయని పర్యాటకుల రాక
• అధికారులు స్పందించాలని జిల్లా ప్రజల డిమాండ్
శ్రీకాకుళం జిల్లాలో విస్తారమైన తీర ప్రాంతం ఉన్నప్పటికీ బీచ్ల అభివృద్ధి మాత్రం ఇప్పటికీ హామీలకే పరిమితమైందనే విమర్శలు వినిపిస్తున్నాయి. సుమారు 193 కిలోమీటర్ల పొడవున విస్తరించిన తీర ప్రాంతం పర్యాటక అభివృద్ధికి అనుకూలంగా ఉన్నా సరైన వసతుల లేమితో సందర్శకులు ఇబ్బందులు పడుతున్నారు.
ఉద్దానం తోటలు, ఎర్రమట్టి దిబ్బలు, పురాతన ఆలయాలు, విదేశీ పక్షుల విడిది కేంద్రాలు, చిత్తడి నేలలు వంటి ప్రకృతి అందాలు ఈ ప్రాంతంలో ఉన్నప్పటికీ వాటిని పర్యాటకంగా అభివృద్ధి చేయడంలో అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రతి సారి బీచ్లను సందర్శించినప్పుడు అభివృద్ధి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని చెబుతున్నా అమలు మాత్రం జరగడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
బారువ, కళింగపట్నం, అక్కుపల్లి, మొగదలపాడు, రట్టి, ఎర్రముక్కాం, భావనపాడు వంటి అనేక బీచ్లను పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేసే అవకాశాలు ఉన్నాయని ఇప్పటికే పర్యాటక శాఖ గుర్తించింది. కనీస వసతులు కల్పిస్తే పర్యాటకుల రాక పెరిగే అవకాశం ఉందని జిల్లా ప్రజలు భావిస్తున్నారు.
