GUNTUR GOOD MORNING AP
గుంటూరు జిల్లా
గుంటూరు మిర్చి మార్కెట్ ఆసియాలో అతిపెద్దది.
అమరావతి బౌద్ధ స్థూపం చారిత్రక ప్రాధాన్యం కలిగి ఉంది.
కొండవీడు కోటలో రహస్య మార్గాలు ఉన్నాయని చెబుతారు.
వ్యవసాయం ప్రధాన వృత్తి.
మిర్చి ఎగుమతులు భారీగా జరుగుతాయి.
చారిత్రక కట్టడాలు విస్తరించి ఉన్నాయి.
వ్యవసాయం, చరిత్ర కలిసిన జిల్లా.
చేబ్రోలులో నల్లమట్టి మాఫియాపై పోలీసుల దాడులు
మంత్రి నారా లోకేష్ ఆదేశాలతో మట్టి మాఫియాపై యాక్షన్
అనుమతులు లేకుండా నల్ల మట్టి తరలింపు..5 లారీలు సీజ్
పోలీస్ స్టేషన్కు సమీపంలో బయటపడిన అక్రమ మైనింగ్ వ్యవహారం
గుంటూరు జిల్లా చేబ్రోలులో నల్ల మట్టి అక్రమ మైనింగ్ వ్యవహారం బయటపడింది. అనుమతులు లేకుండా అర్ధరాత్రి సమయంలో రాజధాని ప్రాంతం నుంచి భారీగా నల్ల మట్టిని తరలిస్తున్న మాఫియాపై పోలీసులు దాడులు చేపట్టారు. మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన పోలీసులు ఐదు లారీలను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు. చేబ్రోలు పోలీస్ స్టేషన్కు కేవలం 200 మీటర్ల దూరంలోనే ఎలాంటి అనుమతులు లేకుండా నల్ల మట్టి తవ్వకాలు జరగడం స్థానికంగా సంచలనం రేపుతోంది. అమరావతి ప్రాంతం నుంచి పొన్నూరు నియోజకవర్గంలోని చేబ్రోలుకు అర్ధరాత్రి సమయంలో భారీ కంటైనర్లలో మట్టిని తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు చర్యలు చేపట్టారు. ఎస్సై వీరనారాయణ ఆధ్వర్యంలో పోలీసులు ఐదు మట్టి లారీలను పట్టుకుని సీజ్ చేశారు. మైనింగ్ బిల్లులు లేకుండా, అనుమతులు లేకుండా మట్టి తరలిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. జిల్లాలో పలు మండలాల్లో ఇదే తరహాలో రైతులను మోసం చేస్తూ, పూడిక పేరుతో నల్ల మట్టిని అక్రమంగా తవ్వి కోట్ల రూపాయలు దండుకుంటున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. రెవెన్యూ అధికారులకు డబ్బు ఆశ చూపి మాఫియా చెలరేగిపోతుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరస్పాండెంట్ కోటేశ్వరరావు అందిస్తారు.
