ANANTHAPURAM
అనంతపురం జిల్లా
రాయలసీమ యాసలో గంభీరత అనంతపురం జిల్లాలో స్పష్టంగా వినిపిస్తుంది.
మాటల్లో బలమైన ఉచ్చారణ, సూటిగా మాట్లాడే శైలి ప్రత్యేకత.
ఎండలకు అలవాటైన జీవన విధానం భాషలో ప్రతిబింబిస్తుంది.
రైతు జీవితం, పల్లె సంస్కృతి పదాల్లో కనిపిస్తాయి.
రాయలసీమ ప్రాంతానికి గుర్తింపుగా అనంతపురం యాస నిలుస్తుంది.
అనంతపురంలో పారిశుద్ధ్య నిర్వహణ అద్వానం
నగర మేయర్ మహమ్మద్ వసీం సంచలన ఆరోపణ
శ్రీనగర్ పార్క్ లో మరమ్మతులకు 65 లక్షల రూపాయలతో పనులు…
ప్రారంభిస్తే ఓ ప్రజాప్రతినిధి పీఏ ఫోన్ చేసి ఆపేశారని మండిపాటు
రహదారులు శుభ్రపరచకపోవడంతో ఇబ్బందులు పడుతున్న ప్రజలు
అనంతపురం పారిశుద్ధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా మారిందని నగర మేయర్ మహ్మద్ వసీం విమర్శించారు. గతం కంటే అదనంగా 36 ట్రాక్టర్ లు పెట్టినా ఇంటింటి చెత్త సేకరణ చేయకపోవడంతో ప్రజలు చెత్తను కాలువల్లో వేస్తుండటంతో మురుగునీరు రోడ్ల పైకి వస్తోందన్నారు. ఇటీవల శ్రీకాకుళంలో పారిశుద్ధ్య సమస్యతో ప్రజలు అనారోగ్యం పడిన సంఘటన చూశామని, అలాంటి ఘటన అనంతపురంలో పునరావృతం కాకూడదని ఆందోళన చేస్తున్నామన్నారు.
పారిశుధ్యంపై తాము ఎన్నిమార్లు చెపుతున్నా అధికారులు కనీసం స్పందించడం లేదన్నారు. నగరంలో ప్రధాన రహదారులను కూడా శుభ్రం చేయడం లేదని, ప్రజలు అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ఒకవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రోడ్లపై గుంతలు ఉండకూడదంటున్నారని, నగరంలో మాత్రం 324 గుంతలను గుర్తించి 60 లక్షల రూపాయలతో టెండర్లు పిలిచి భూమిపూజలు చేస్తూ పనులు చేపట్టడం లేదని ఆరోపించారు. నగరంలోని శ్రీనగర్ పార్క్ లో మరమ్మతులకు 65 లక్షల రూపాయలతో పనులు ప్రారంభిస్తే కీలక ప్రజాప్రతినిధి పిఏ ఫోన్ చేసి పనులు ఆపించారని మండిపడ్డారు. దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరస్పాండెంట్ సాయిప్రసాద్ అందిస్తారు.


