KAKINADA GOOD MORNING AP
కాకినాడ జిల్లా
హోప్ ఐలాండ్ సముద్ర అలల నుంచి తీరాన్ని రక్షించే సహజ కవచంలా పనిచేస్తుంది.
కాకినాడ పోర్ట్ వాణిజ్యానికి కీలక కేంద్రంగా ఉంది.
కొబ్బరి తోటలు విస్తారంగా కనిపిస్తాయి.
నది, సముద్రం కలిసే ప్రత్యేక భౌగోళిక నిర్మాణం ఉంది.
మత్స్యకార పరిశ్రమ అభివృద్ధి చెందింది.
సముద్ర ఆహార ఎగుమతులు ఎక్కువగా జరుగుతాయి.
సముద్ర వనరులతో అభివృద్ధి చెందిన జిల్లా.
ప్రభుత్వ పథకాల లక్ష్య సాధనలో బ్యాంకర్లు కీలక పాత్ర
రుణాల మంజూరు వేగవంతం చేయాలని జేసీ సూచనలు
జిల్లాలో రుణాల పంపిణీ 98.73% పూర్తి: అపూర్వ భరత్
రైతులు, మహిళలకు విరివిగా రుణాలు అందించాలి: జేసీ
డ్వాక్రా, మెప్మా సంఘాలకు భారీగా రుణాల పంపిణీ
ఉపాధి పథకాలపై అవగాహన పెంచాలి: ఎమ్మెల్సీ పద్మశ్రీ
ప్రభుత్వ పథకాల లక్ష్య సాధనలో బ్యాంకర్లు కీలక పాత్ర పోషించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ పేర్కొన్నారు. రైతులు, స్వయం సహాయక సంఘాలు, యువతకు రుణాల మంజూరు ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. కాకినాడ కలెక్టరేట్లో బ్యాంకర్లు, జిల్లా అధికారులతో జిల్లా సంప్రదింపుల కమిటీ, జిల్లా స్థాయి సమీక్ష కమిటీ సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశానికి ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వివిధ రంగాలకు రుణాల పంపిణీపై సమీక్ష చేపట్టిన అధికారులు, తదుపరి త్రైమాసికాల కోసం ప్రణాళికలను చర్చించారు. జిల్లాలో మొత్తం 26 వేల 408 కోట్ల రుణ లక్ష్యానికి గాను ఇప్పటివరకు 26 వేల 074.5 కోట్లు పంపిణీ చేసి 98.73 శాతం సాధించినట్లు తెలిపారు. వ్యవసాయ రంగంలో 13 వేల 733 కోట్ల లక్ష్యానికి గాను 12 వేల 632 కోట్ల రుణాలు రైతులకు అందించినట్లు వెల్లడించారు. రానున్న త్రైమాసికాల్లో పంట రుణాలను మరింత వేగవంతం చేయాలని బ్యాంకర్లకు సూచించారు. గ్రామీణ అభివృద్ధి శాఖ ద్వారా 10 వేల 186 డ్వాక్రా సంఘాలకు 1,298 కోట్లకు పైగా రుణాలు అందించగా… మెప్మా ద్వారా 2 వేల 737 పట్టణ సంఘాలకు 420 కోట్ల రుణాలు పంపిణీ చేశారు. అలాగే 3 వేల 526 మహిళా వ్యాపారవేత్తలకు 55 కోట్లకు పైగా రుణాలు మంజూరు చేసినట్లు తెలిపారు. పీఎంఈజీపీ కింద లక్ష్యాన్ని మించి యూనిట్లకు రుణాలు మంజూరు చేయగా… ప్రధాన్ మంత్రి ముద్రా యోజన కింద కూడా పెద్దఎత్తున రుణాలు అందించినట్లు వెల్లడించారు. దీనిపై మరింత సమాచారం మా రీజనల్ కోఆర్డినేటర్ నానాజీ అందిస్తారు.
