PRAKASAM
ప్రకాశం జిల్లా
చీమకుర్తి గ్రానైట్ ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి అవుతుంది.
భైరవకొండ గుహాలయాలు చారిత్రక ప్రాధాన్యం కలిగి ఉన్నాయి.
నల్లమల పర్వతాలు ప్రకృతి అందాన్ని ఇస్తాయి.
ఒంగోలు ఎద్దులు ప్రత్యేక జాతిగా గుర్తింపు పొందాయి.
వ్యవసాయం ప్రధాన వృత్తి.
ఖనిజ సంపద సమృద్ధిగా ఉంది.
వ్యవసాయం, ఖనిజాల కలయిక.
ఒంగోలు కేడర్తో జగన్ భేటీ.. బలోపేతంపై ఫోకస్
తాడేపల్లిలో జగన్ మీటింగ్.. నాయకులకు కీలక సందేశం
ప్రకాశం జిల్లాపై జగన్ దృష్టి.. నేతల పనితీరుకు ప్రశంసలు
బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి జగన్ ప్రశంసలు.. భవిష్యత్తుపై క్లారిటీ
కష్టకాలంలో పార్టీకి అండగా నిలిచిన నేతలు: జగన్
ఒంగోలు రాజకీయాల్లో వైసీపీకి నూతన దిశ.. జగన్ సూచనలు
తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ కేడర్ తో వైఎస్ జగన్ భేటీ అయ్యారు. వైఎస్ జగన్ భేటీలో పార్టీ జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, ఒంగోలు ఇంఛార్జి చుండూరు రవి, పార్లమెంటు ఇంఛార్జి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సహా స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇక ప్రకాశం జిల్లాలో పార్టీ బలోపేతంపై దృష్టి సారించిన జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. జిల్లా వైసీపీ అధ్యక్షుడు, దర్శి MLA బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి పనితీరును ప్రశంసిస్తూ భవిష్యత్లో మంచి అవకాశాలు ఉంటాయన్నారు. యువకుడు, ఉత్సాహవంతుడు, పార్టీ కోసం అన్నివిధాలా కృషి చేస్తున్నాడని, కష్టకాలాల్లో కూడా పార్టీకి గట్టిగా నిలబడుతున్నడని, దేవుడి ఆశీర్వాదం ఉంటే రాబోయే రోజుల్లో ఉన్నత స్థానాల్లో ఉంటాడని విశ్వాసం వ్యక్తం చేశారు. అలాగే ఒంగోలు నియోజకవర్గ సమన్వయకర్త చుండూరి రవి పార్టీ కోసం కష్టపడుతున్నాడని అన్నారు. ఇక ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా మార్కాపురం జిల్లా కరెస్పాండెంట్ ప్రశాంత్ అందిస్తారు.
