EAST GODAVARI
తూర్పు గోదావరి జిల్లా
గోదావరి జిల్లాలో పిండివంటలు ప్రత్యేకంగా గుర్తింపు పొందాయి.
పూతరేకులు, పూతపాకులు ప్రసిద్ధి చెందిన స్వీట్లు.
చేపల పులుసు, పీత కూరలు కూడా విస్తృతంగా వాడుతారు.
కొబ్బరి, మసాలాలతో చేసే వంటలు ప్రత్యేక రుచి ఇస్తాయి.
గోదావరి ఆహారం తీయదనం, రుచితో ప్రత్యేకంగా నిలుస్తుంది.
• తూర్పుగోదావరి మన్యంలో పెద్దపులి సంచారం కలకలం
• గంగవరం – అడ్డతీగల మండలాల్లో పులి కదలికలు గుర్తింపు
• రేడియో కాలర్ ద్వారా పులి ఆచూకీపై నిఘా
• 65 మంది అటవీ సిబ్బందితో గస్తీ… ప్రత్యేక బృందాల మోహరింపు
• పులి సంచారంతో గోకవరం, జగ్గంపేట పరిసరాల్లో ప్రజల్లో భయం
తూర్పుగోదావరి జిల్లాలో పెద్దపులి సంచారం ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. పోలవరం జిల్లా రంపచోడవరం మన్యంలోకి వచ్చిన పెద్దపులి నిన్నంతా గంగవరం మండల పరిధిలో సంచరించినట్లు అటవీ అధికారులు గుర్తించారు. ఏలేరు జలాశయం వెనుక దట్టమైన అటవీ ప్రాంతంలోని కొండల మధ్య పులి సేదతీరుతున్నట్టు సమాచారం.
నిన్న ఏలేరు రిజర్వాయర్ వెనుక భాగంలోని పులికొండ ప్రాంతంలో పులి పాదముద్రలను అధికారులు సేకరించారు. రాత్రి సమయంలో గంగవరం మండలం మల్లవరం, అడ్డతీగల మండలం తిమ్మాపురం మధ్య ప్రాంతంలో పులి కదలికలు రేడియో కాలర్ ద్వారా నమోదయ్యాయి.
పులిని సురక్షితంగా బంధించేందుకు అటవీ శాఖ అప్రమత్తమైంది. మొత్తం 65 మంది అటవీ సిబ్బందితో పాటు నాగార్జునసాగర్–శ్రీశైలం టైగర్ ప్రాజెక్టు నుంచి వచ్చిన 11 మంది సభ్యులతో రెండు ప్రత్యేక బృందాలు గస్తీ కాస్తున్నాయి.
పులి సంచారంతో గోకవరం, గంగవరం, అడ్డతీగల, జగ్గంపేట పరిసర ప్రాంతాల్లో ప్రజల్లో భయాందోళన నెలకొంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా తూర్పుగోదావరి జిల్లా స్పెషల్ కరస్పాండెంట్ సత్యనారాయణ అందిస్తారు.
